← Back to news

మిస్సింగ్ చిల్డ్రన్ కోసం.. సుప్రీంకోర్టు ఆదేశాలు!

By sahani· 19 Aug 2026· Thehindu
మిస్సింగ్ చిల్డ్రన్ కోసం.. సుప్రీంకోర్టు ఆదేశాలు!

తప్పిపోయిన, రక్షించబడిన పిల్లలను శాస్త్రీయంగా గుర్తించి, వారి కుటుంబాలతో త్వరగా కలిపేందుకు జాతీయ DNA, బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన PILపై సుప్రీంకోర్టు స్పందించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, NCPCRలకు నోటీసులు జారీ చేసింది. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు, పిల్లల పునరావాసం కోసం జాతీయ, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని పిటిషనర్ రీపక్ కన్సల్ కోరగా, కోర్టు విచారణ చేపట్టింది.

More in Current Affairs