← Back to news

మల్లేశ్వరస్వామి చోరీ కేసు సాల్వ్!

By rajaratnam· 2d ago
మల్లేశ్వరస్వామి చోరీ కేసు సాల్వ్!

గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బంగారు ఆభరణాలు దొంగిలించిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 68 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అందులో 50 గ్రాముల నాగాభరణం, రెండు మంగళసూత్రాలు, బంగారు గుత్తి ఉన్నాయి. క్రైం నంబర్ 448/2026 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని అధికారులు అభినందించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 5h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.