మల్లేశ్వరస్వామి చోరీ కేసు సాల్వ్!

గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బంగారు ఆభరణాలు దొంగిలించిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 68 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అందులో 50 గ్రాముల నాగాభరణం, రెండు మంగళసూత్రాలు, బంగారు గుత్తి ఉన్నాయి. క్రైం నంబర్ 448/2026 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని అధికారులు అభినందించారు.



