గేదెలను మేపుతుండగా విషాదం

TG: పాడి గేదెలను మేపేందుకు వెళ్లిన రైతుకు ఊహించని విషాదం ఎదురైంది. విద్యుత్ ఘాతానికి గురై రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోదా రమేష్ గ్రామ శివారులో గేదెలను మేపుతుండగా విద్యుత్ స్తంభం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యాయి. దీంతో రెండు పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో బాధిత రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.



