మా కాలేజీకి 3 రోజులేనా? 6 రోజుల రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి!

నారాయణపేట జిల్లా మక్తల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూపు స్టూడెంట్స్కు బోటనీ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా మారింది. 200 మందికిపైగా విద్యార్థులు ఉన్నా.. వారానికి 3 రోజులు మాత్రమే తాత్కాలిక లెక్చరర్ రావడంతో చదువు నిలిచిపోయే పరిస్థితి. అధికారులు చేసిన ఈ తాత్కాలిక ఏర్పాటు సరిపోదని డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం చెబుతోంది. పూర్తిస్థాయి రెగ్యులర్ బోటనీ ఫ్యాకల్టీ కేటాయించాలని, వారంలో 6 రోజుల పాటు క్లాసులు నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని కోరారు.



