జయహో భారత్ ... న్యూక్లియర్ పవర్ లో రికార్డు!!

న్యూక్లియర్ పవర్లో భారత్ కొత్త విజయం సాధించింది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల ద్వారా ఇంధనాన్ని తయారు చేయడంలో సక్సెస్ అయింది. తమిళనాడు, కల్పక్కంలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మన దేశంలో దొరికే యురేనియం 238 రకం, థోరియం లను ఉపయోగించి రియాక్టర్ నడిచేందుకు ఇంధనాన్ని తయారు చేసింది. కానీ అణు రియాక్టర్ నడవాలంటే యురేనియం 235 రకం అవసరం. మనకు ఈ నిల్వలు లేవు. దాంతో పుష్కలంగా దొరికే ఆల్టర్నేటివ్ ఖనిజంతో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ను పనిచేయించారు. ఇది ఇంధనం తనకు తాను తయారు చేసుకుంటుంది..పైగా అణు శక్తిని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.



