బీఆర్ఎస్ ధర్నా.. రైతులకు 24x7 కరెంట్ కావాలి!

నాగర్కర్నూల్ జిల్లా తాడూరులో రైతుల సమస్యల పరిష్కారం కోసం BRS నాయకులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కరెంట్ కట్స్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నష్టం వాటిల్లుతోందని, నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సబ్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.



