← Back to news

రీ-సర్వే పురోగతి.. మందసలో జాయింట్ కలెక్టర్ సమీక్ష!

By CHANDU· 2d ago· Palasa, Palasa, Srikakulam
రీ-సర్వే పురోగతి.. మందసలో జాయింట్ కలెక్టర్ సమీక్ష!

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో రీ-సర్వే పనుల పురోగతిపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సమీక్షించారు. మొత్తం 83 గ్రామాలకు గాను 47 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయింది. మిగిలిన 36 గ్రామాల్లో పనులు 2027 మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి.శ్రీహరి, డీటీ కె.రామకృష్ణ, సర్వేయర్ బాబురావు, ఎంఆర్ఐ ఇందిర పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.