ఆస్పత్రిలో చేరిన YS షర్మిల

AP కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల ఆస్పత్రిలో చేరిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తనకు కడుపుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగినట్లు ఆమె సోషల్ మీడియాలో ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫోటోను పంచుకుంటూ వెల్లడించారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఏ కారణంతో, ఎలాంటి సర్జరీ జరిగిందనే వివరాలను వెల్లడించలేదు. ఇటీవల పార్టీ కార్యక్రమాలు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్న షర్మిల.. నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన ఆందోళనల్లో కూడా కనిపించలేదు.



