పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అదే: హైడ్రా కమిషనర్

TG: పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారని, ఆయన భూములు దాదాపు ఆరేడు ఎకరాల వరకు కోడి చెరువులో ఉన్నాయని చెప్పారు. మిగతా 3, 4 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ బయట ఉన్నాయని స్పష్టం చేశారు. 'చెరువులో ఫెన్స్ వేయకూడదు. కానీ పవన్ కల్యాణ్ చెరువులో ఫెన్స్ వేశారు. అది ఆయన చేసిన తప్పు' అని అన్నారు.



