← Back to news

ప్రాణం తీసిన ఈత సరదా

By dk yamjala· 26 May 2026
ప్రాణం తీసిన ఈత సరదా

TG: సరదాగా ఈతకని వెళ్లి చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం మణికొండకు చెందిన కమల్ అనే యువకుడు మంగళవారం తన స్నేహితులతో కలిసి నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు కమల్ డెడ్‌బాడీని బయటకు తీసి నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రాణం తీసిన ఈత సరదా

More in Local