నేపాల్లో భారీ Flash Floods.. 105 మంది ఇండియన్స్ మిస్సింగ్!
నేపాల్లోని రాసువా జిల్లాలో ఈరోజు ఒక్కసారిగా భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. టిబెట్ వైపు నుంచి వచ్చిన నీరు భోటేకోషి నదిలో ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలు, రోడ్లు, బ్రిడ్జ్లు కొట్టుకుపోయాయి. ఈ వరదలలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా, 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. దీంతో బీహార్ బోర్డర్లోని జిల్లాలకు హైఅలెర్ట్ ప్రకటించారు.



