← Back to news

'అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలి'

By dk yamjala· 26 May 2026
'అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలి'

TG: బక్రీద్ పండుగ నేపథ్యంలో మెదక్ టౌన్ పరిధిలోని బోధన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టును మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. తనిఖీ చేసిన వాహనాల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

'అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలి'
'అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలి'

More in Local