రాజోలిలో ప్రీ ప్రైమరీ బడిలో కృష్ణాష్టమి వేడుకలు
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి పునరావాస గృహాల MPPS న్యూ ప్లాట్స్ పాఠశాలలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. హెచ్ఎం రామాంజనేయులు ఆధ్వర్యంలో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషాల్లో అలరించారు. నవ్యశ్రీ కృష్ణుడిగా, సంయుక్త గోపికగా ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు. రేణుక, ఇంద్రవర్ధన, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.



