పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నిరసన

TG : యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నిరసన మొదలుపెట్టారు. కరీంనగర్లోని ఎస్ఈ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.



