ఆ అధికారి వల్ల చికెన్ రంగు మారింది!

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్, ఐఏఎస్ అధికారి తుకారాం ముండే వల్ల ముంబైలో రెస్టారెంట్లలో చికెన్ రంగు మారింది. ఎలాగో తెలుసా? ఫుడ్ ఇన్స్ఫెక్షన్లో ఆయన చూపిన స్ట్రిక్ట్నెస్ వల్ల ముంబయిలో రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు వంటల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడటం మానేశారు. చికెన్ లాలిపాప్, మంచూరియన్ లాంటి వంటలను ఎలాంటి రంగులు కలపకుండా కస్టమర్లకు అందిస్తున్నారు.



