ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు

TG: హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై కీలక చర్యలు తీసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదు, CCTV ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ ఆరోపణలు నిజమని నిర్ధారించింది. దీంతో ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ NPA నుంచి పంపించేశారు. ఈ నిర్ణయం ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సర్వీస్లో తిరిగి జాయినింగ్కు సంబంధించిన తుది నిర్ణయం DOPT తీసుకుంటుందని పోలీస్ అకాడమీ అధికారులు వెల్లడించారు.



