విజయవాడ ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యం

AP: విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రైల్వే, వీఎంసీ అధికారులతో ఎంపీ కేశినేని చిన్ని సమావేశమయ్యారు. ఆర్యూబీలు, ఆర్ఓబీ లు, డ్రైనేజీ, పైప్లైన్ సమస్యలపై చర్చించారు. వచ్చే వారంలో యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పనులు ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.



