గోల్డ్ మెడల్.. రంగారెడ్డి బాక్సర్ భవ్యతేజిని!

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలానికి చెందిన ఓ పేద విద్యార్థిని సంచలనం సృష్టించింది. ఆమె పేరు జిల్లెళ్ళ భవ్యతేజిని. నార్సింగి గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు జంగయ్య, పరిమళ రాణి. ఈ చిన్నారి బాక్సింగ్ రింగ్లో సత్తా చాటుతోంది. హైదరాబాద్ షేక్పేట్ స్టేడియంలో డిస్ట్రిక్ట్ లెవల్ అండర్-17 బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ నెగ్గింది. ఇప్పటివరకు ఆమె 4 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. పేదరికాన్ని జయించి.. ఇలా మెరవడం అద్భుతం కదూ! ఆమె ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.




