కేరళ చర్చీలో రెండు వర్గాల ఘర్షణ
కేరళలోని ఎర్నాకులం జిల్లా మువట్టుపుళా సమీపంలోని పిరమడం సెయింట్ జాన్స్ బెత్లెహెమ్ చర్చిలో మలంకర ఆర్థడాక్స్ సిరియన్ చర్చి, జాకబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చి సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆర్థడాక్స్ సభ్యులు ప్రేయర్ చేసేందుకు చర్చిలోకి రాగా, జాకబైట్ కంట్రోల్లో ఉన్న చర్చి సభ్యులు వ్యతిరేకించారు. రెండు వర్గాలు వేర్వేరు కోర్టు ఆదేశాలను చూపించి వాగ్వాదానికి దిగాయి. పోలీసులు వచ్చి చర్చిని మూసేశారు.



