కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన

AP: నారా భువనేశ్వరి కుప్పంలో తన నాలుగు రోజుల పర్యటనను ఈ రోజు మొదలుపెట్టారు. ఇందులో మొదటి రోజు రామకుప్పం మండలం విజిలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ కు వెళ్లి అక్కడి స్టూడెంట్స్ తో కాసేపు గడిపారు. స్కూల్లో చదువులు ఎలా సాగుతున్నాయి, మధ్యాహ్న భోజనం టేస్ట్ ఎలా ఉందో పిల్లలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి బాగా చదువుకుని ఫ్యూచర్ లో గొప్ప స్థాయికి ఎదగాలని ఆమె స్టూడెంట్స్ తో అన్నారు.





