భారత్కు ఉజ్బెకిస్థాన్ నుంచి యురేనియం

భారత్ అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి మరో కీలక అడుగు వేసింది. ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్కు దీర్ఘకాలంగా యురేనియం సరఫరా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అణు విద్యుత్ కేంద్రాలకు యురేనియం కీలక ఇంధనం కావడంతో.. ఒకే దేశంపై ఆధారపడకుండా సరఫరా మార్గాలను పెంచుకోవడం భారత్కు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భారత్ వచ్చే సంవత్సరాల్లో అణు విద్యుత్ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ డీల్కు ప్రాధాన్యం పెరిగింది.



