రష్యా సైన్యంలో 51 మంది భారతీయులు మృతి

రష్యా సైన్యంలో చేరిన భారతీయుల విషయంలో షాకింగ్ వివరాలు బయటకొచ్చాయి. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 227 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరారు. వీరిలో ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 139 మందిని సైన్యం నుంచి విడుదల చేశారు. ఇంకా కొంతమంది రష్యా సైన్యంలో ఉన్నారు. వారిని కూడా విడుదల చేసి భారత్కు తీసుకురావడానికి రష్యాతో చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అసలు వీరంతా రష్యా సైన్యంలోకి ఎలా వెళ్లారు అనేదే ఇప్పుడు చర్చగా మారింది.



