← Back to news

రష్యా సైన్యంలో 51 మంది భారతీయులు మృతి

By Nani Garikina· 3d ago
రష్యా సైన్యంలో 51 మంది భారతీయులు మృతి

రష్యా సైన్యంలో చేరిన భారతీయుల విషయంలో షాకింగ్‌ వివరాలు బయటకొచ్చాయి. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిశ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 227 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరారు. వీరిలో ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 139 మందిని సైన్యం నుంచి విడుదల చేశారు. ఇంకా కొంతమంది రష్యా సైన్యంలో ఉన్నారు. వారిని కూడా విడుదల చేసి భారత్‌కు తీసుకురావడానికి రష్యాతో చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అసలు వీరంతా రష్యా సైన్యంలోకి ఎలా వెళ్లారు అనేదే ఇప్పుడు చర్చగా మారింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 1h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.