గాయాలు రేపుతున్న అనుమానాలు- పెల్లట్ గన్స్ వాడారా?

విద్యార్ధుల నిరసనలలో పాల్గొన్న ఓ ఢిల్లీ యువకుడి ఒంటిపై అనేక చిన్న చిన్న గాయలు ఉండటంతో పోలీసులు పెల్లెట్ గన్స్, షాక్ బ్యాటన్స్ వాడారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన "సంసద్ చలో" ర్యాలీ నిరసనలో పాల్గొన్న షేక్ ఇర్షాద్ మన్సూరీ అనే యువకుడికి పెల్లెట్ తరహా గాయాలయ్యాయి. లేడీ హార్డింజ్ ఆస్పత్రి వైద్యులు సర్జరీ చేసి అతడి కంటి కింద ఉన్న గుళ్లను తొలగించారు. అయితే తమ బలగాలు ఎలాంటి పెల్లెట్ గన్లు వాడలేదని ఢిల్లీ పోలీసులు, PIB స్పష్టం చేశాయి. నీట్ సహా ఇతర పరీక్షల సంస్కరణల కోసం చేపట్టిన ఈ ఆందోళనలో 80 మందికి పైగా గాయపడ్డారు.



