పైలట్లకు డ్రగ్ టెస్ట్ రూల్స్ Strict.. కేంద్రం ప్లాన్

కమర్షియల్ పైలట్లకు ఏడాదికోసారి ర్యాండమ్గా డ్రగ్ టెస్టులు చేసేందుకు Proposalను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొత్తం పైలట్లలో 10 శాతం మందికి ర్యాండమ్ డ్రగ్ టెస్టులు చేస్తున్నారు. రూల్స్ను మరింత స్ట్రిక్ట్ చేయాలని DGCA ఏవియేషన్ కంపెనీలతో చర్చలు జరుపుతోందని సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇప్పటికే పైలట్లందరికీ కంపల్సరీగా డ్రగ్ టెస్టులు ప్రారంభించాయన్నారు.



