← Back to news

రైతులకు బిగ్ అప్డేట్!

By sahani· 6 Aug 2026· India
రైతులకు బిగ్ అప్డేట్!

ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఊళ్లలో ఉండే పశువుల పేడ, వ్యవసాయ చెత్త నుంచి బయోగ్యాస్, క్లీన్ ఫ్యూయెల్ మరియు సేంద్రీయ ఎరువులు తయారు చేసే 'గోబర్ధన్' స్కీమ్‌కు రూ.23,731 కోట్ల బడ్జెట్‌తో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం రానుంది. దీంతో పాటు రూ.8,970 కోట్లతో అసోంలో నిర్మించబోయే 4-లేన్ నేషనల్ హైవే ప్రాజెక్ట్‌కి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది!

More in Politics