గబ్బిలాలపేటలో స్కూల్ కోసం 24న ‘చలో కలెక్టరేట్’

TG: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లోని గబ్బిలాలపేట బస్తీలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్(ఆరుట్ల మోడల్)ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ ఆగస్టు 24 ఉదయం 9 గంటలకు ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించనుంది. కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, డాక్టర్ ఎం.వి.రెడ్డి, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి, జర్నలిస్టు తులసి చందు తదితరులు హాజరుకానున్నారు.


