శిరోమణి అకాలీ దళ్(SAD) జాతీయ అధ్యక్షుడిపై దాడి

మహారాష్ట్రలోని నాందేడ్లో శిరోమణి అకాలీ దళ్(SAD) జాతీయ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి జరిగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి గురుద్వారా మాతా సాహిబ్ కౌర్లో పూజలు చేసేందుకు వెళ్లారు. ఆ టైంలో ఓ నిహంగ్ సిక్కు కిర్పాన్తో బాదల్పై దాడికి ప్రయత్నించారు. బాదల్ సెక్యూరిటీ సిబ్బంది అతణ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాడిలో బాదల్ చేతికి గాయం కాగా, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.



