ఇండస్ వాటర్పై భారత్ తగ్గడం లేదు!

ఇండస్ వాటర్ ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని 2025లో భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే తాజాగా హేగ్లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఈ ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందని తీర్పు ఇచ్చింది. దీనిపై భారత్ మాత్రం కోర్టుకు ఈ విషయంలో ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసి, తన నిర్ణయం కొనసాగుతుందని తెలిపింది. దీంతో భారత్–పాకిస్థాన్ మధ్య నీటి వివాదం మరింత తీవ్రతరమైంది. ఈ తీర్పు జమ్మూ కశ్మీర్లోని రాట్లే హైడ్రో ప్రాజెక్ట్పై కూడా ప్రభావం చూపనుంది.




