మూల్యం ఎవరు చెల్లిస్తారు?: కపిల్ సిబల్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు. "ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది?" అంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్పై లాఠీచార్జ్ జరిగిందని, చాలామంది గాయపడ్డారని, కొందరి కళ్లలో పెలెట్స్ దిగాయని, 23 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారని గుర్తుచేశారు. ఈ మూల్యం ఎవరు చెల్లిస్తారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.



