ఉచిత కంటి పరీక్షలతో దేశానికి రూ.3.6 లక్షల కోట్ల లాభం!

పాఠశాలల్లో ఉచిత కంటి పరీక్షలు, తక్షణ రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా రూ.3.6 లక్షల కోట్ల లబ్ధి చేకూరుతుందని 'IAPB', 'సేవా', 'ఫ్రెడ్ హాల్లోస్' సంస్థల ఉమ్మడి 'వాల్యూ ఆఫ్ విజన్' నివేదిక పేర్కొంది. అందరికీ ప్రాథమిక నేత్ర వైద్యం అందించడం ద్వారా ఉత్పాదకత, ఉద్యోగావకాశాలు పెరిగి దేశ ప్రగతి వేగవంతమవుతుందని అంతర్జాతీయ విశ్లేషకుల ఒపీనియన్ ను బిజినెస్ స్టాండర్ట్ పబ్లిష్ చేసింది.



