← Back to news

గిరిజనుల సాగు భూములకు సౌకర్యాలు కల్పించాలి

By aveen kumar· 18 Aug 2026· ఖమ్మం జిల్లా
గిరిజనుల సాగు భూములకు సౌకర్యాలు కల్పించాలి

TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల గిరిజన రైతుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. గిరిజనులు సాగుచేస్తున్న భూములకు హక్కుపత్రాలు మంజూరు చేయడంతోపాటు బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం భద్రాచలం ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని పది గ్రామాల్లో గిరిజనులు సుమారు 20ఏళ్లుగా పోడు భూముల్లో సాగు చేస్తున్నారని, సాగునీటివసతి లేక పంటలు నష్టపోతున్నారని తెలిపారు. హక్కుపత్రాలు లేని రైతులకు వెంటనే పట్టాలు అందించి ప్రభుత్వ రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local