← Back to news

ప్లాస్టిక్‌ కవర్లు తొలగించండి.. అధికారులు వార్నింగ్‌

By MPJ NEWS· 27 Aug 2026
ప్లాస్టిక్‌ కవర్లు తొలగించండి.. అధికారులు వార్నింగ్‌

AP: పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు గురజాల నగర పంచాయతీ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. కమిషనర్‌ వైవీఎల్‌ శివన్నారాయణరావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, థర్మాకోల్‌ వస్తువుల విక్రయాలు, వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు. సెప్టెంబర్‌ 5లోపు దుకాణాల్లో నిల్వఉన్న నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించాలన్నారు.

More in Local