నీళ్లు లేక ఎండిపోతున్న వరి పొలాలు!
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం రింతాడ గ్రామంలో సరైన వర్షాలు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి. పంటకు నీళ్లు అందక దిగుబడి తగ్గిపోతుందని రైతులు బాధపడుతున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల పంటలు దెబ్బతినేలా ఉన్నాయని వారు భయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామాల్లో పంటలను పరిశీలించాలని, సాగునీటి వసతులు కల్పించి ఆదుకోవాలని మాజీ ఉప సర్పంచ్ సోమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.



