కరోనా కలకలం.. ఎయిమ్స్లో ప్రత్యేక వార్డు

AP: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి కొవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చిన ఓ వ్యక్తికి డాక్టర్స్ చికిత్స అందించారు. బాధితుడిని హోం ఐసోలేషన్లో ఉండాలని ఇంటికి పంపించారు. ఇటీవల జ్వరాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటం, కొవిడ్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఎయిమ్స్ డాక్టర్స్ ముందస్తు చర్యలు చేపట్టారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, జ్వరంతో వచ్చే రోగులకు ఇక్కడే ప్రత్యేక వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎయిమ్స్లో కరోనా కలకలం రేపడంతో గుంటూరు (GGH) వైద్యులు అలెర్ట్ అయ్యారు.



