← Back to news

భీమ్ ఆర్మీ TG చీఫ్‌గా సిద్దు రావణ్.. టార్గెట్ ఏంటంటే?

By Thukaram· 1d ago
భీమ్ ఆర్మీ TG చీఫ్‌గా సిద్దు రావణ్.. టార్గెట్ ఏంటంటే?

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దు రావణ్ నియమితులయ్యారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, జాతీయ అధ్యక్షులు వినయ్ రతన్ సింగ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా సిద్దు రావణ్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ ఆశయాల సాధనే తమ లక్ష్యమని, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడతామని అన్నారు. తెలంగాణను బహుజనుల అడ్డాగా మార్చి, నీలి జెండా రాష్ట్రంగా తీర్చిదిద్దతామని ధీమా వ్యక్తం చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 39m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.