భీమ్ ఆర్మీ TG చీఫ్గా సిద్దు రావణ్.. టార్గెట్ ఏంటంటే?

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దు రావణ్ నియమితులయ్యారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, జాతీయ అధ్యక్షులు వినయ్ రతన్ సింగ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా సిద్దు రావణ్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ ఆశయాల సాధనే తమ లక్ష్యమని, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడతామని అన్నారు. తెలంగాణను బహుజనుల అడ్డాగా మార్చి, నీలి జెండా రాష్ట్రంగా తీర్చిదిద్దతామని ధీమా వ్యక్తం చేశారు.



