← Back to news

రోగుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది?: AITUC

By Jaafar Ali· 19 Aug 2026· Srisailam, Srisailam, Nandyal

AP: రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై నంద్యాల జిల్లా సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు, స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సున్నిపెంటలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. రాత్రి అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. 24 గంటలూ వైద్యులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

More in Local