← Back to news

హోటల్‌లో మంటలు.. 7 మంది సజీవ దహనం!

By Mahesh· 17 Aug 2026· West Bengal

వెస్ట్ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లా తారాపీఠ్‌లో ఈరోజు తెల్లవారుజామున హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల హోటల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో దాదాపు ఉదయం 5 గం. మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఎక్కువ మంది అతిథులు నిద్రలో ఉండటంతో కొందరు లోపల చిక్కుకున్నారు. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, కొందరికి గాయాలయ్యాయి. వారిని రాంపూర్‌హాట్‌ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 8h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.