హోటల్లో మంటలు.. 7 మంది సజీవ దహనం!
వెస్ట్ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్లో ఈరోజు తెల్లవారుజామున హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపు ఉదయం 5 గం. మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఎక్కువ మంది అతిథులు నిద్రలో ఉండటంతో కొందరు లోపల చిక్కుకున్నారు. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, కొందరికి గాయాలయ్యాయి. వారిని రాంపూర్హాట్ గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.



