ఆస్తులు ఉన్నా అంత్యక్రియలకు ఎవరూ రాలేదు!

ఆస్తులున్నా ఆత్మీయులు లేక ఓ కుబేరుడు అనాథగా కన్నుమూశాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన కోటీశ్వరుడు రాజకుమార్ సక్సేనాకు ఆస్తులు, ముగ్గురు కొడుకులు, కూతురు, భార్య ఉన్నారు. ఆస్తులన్నీ రాయించుకున్నాక అతడిని ఇంట్లోంచి వెళ్లగొట్టారు. వృద్ధాశ్రమంలో ఉన్న ఆయన అనారోగ్యంతో ఈ నెల 11న ఆస్పత్రిలో మరణించారు. చనిపోయేముందు కుటుంబాన్ని చూడాలనుకున్నా ఆయన కోరిక తీరలేదు. డాక్టర్లు సమాచారమిచ్చినా తమకేం సంబంధం లేదని చెప్పారు. చివరికి పోలీసులే స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు.



