← Back to news

భూముల రీసర్వే.. 108 గ్రామాల్లో హడావిడి!

By Adithya· 2d ago
భూముల రీసర్వే.. 108 గ్రామాల్లో హడావిడి!

రంగారెడ్డి జిల్లాలో భూముల సర్వే పనులు ముమ్మరం. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తహసిల్దార్లకు క్లియర్ ఆర్డర్ ఇచ్చారు. షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 611 గ్రామాలకు గాను 108 గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. భూభారతి, 22ఏ విషయాల్లో బ్రోకర్లను నమ్మొద్దని రైతులకు హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల సలహా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సరిత పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.