అక్టోబర్కు ముందే సిద్ధం కావాలి.. కలెక్టర్ బిగ్ డెసిషన్

TG: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ముందే నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలోని ప్రస్తుత నిల్వ పరిస్థితులు, గత మూడు సీజన్ల కస్టమ్ మిల్డ్ రైస్ బకాయిలపై చర్చించారు. అక్టోబర్ చివరి వారం నుంచి కొత్త ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అప్పటిలోగా గోదాములు, ఖాళీ ప్రాంగణాలు సిద్ధం చేయాలని సూచించారు.



