కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం

TG: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతామని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. AICC కార్యదర్శి సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించారు. సచిన్ సావంత్ పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.



