స్కూల్కు స్పోర్ట్స్ యూనిఫాం అందజేత

TG: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు దాతలు రూ.20 వేల విలువైన స్పోర్ట్స్ యూనిఫాంను అందజేశారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశంతో గ్రామానికి చెందిన రితిక్, సతీష్ ఈ క్రీడా దుస్తులను వితరణ చేశారు. దాతలను HM షేక్ అబ్దుల్, ఉపాధ్యాయుడు రఘువీర్ పాఠశాల తరఫున సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ప్రగత్ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు రూ.5 వేల విరాళం అందించారు.





