← Back to news

సైబర్ నేరాలపై చిన్న తాండ్రపాడులో అవగాహన!

By Prakash· 2d ago· Chinna Tandrapadu, Ieeja, Jogulamba Gadwal
సైబర్ నేరాలపై చిన్న తాండ్రపాడులో అవగాహన!

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ప్రత్యేక సదస్సు జరిగింది. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆందోళనగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అపరిచితుల లింకులు, కాల్స్‌పై క్లిక్ చేయొద్దు. మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు 1930కి కాల్ చేయాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ ప్రకాష్, స్థానికులు పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 5h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.