సైబర్ నేరాలపై చిన్న తాండ్రపాడులో అవగాహన!

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ప్రత్యేక సదస్సు జరిగింది. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆందోళనగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అపరిచితుల లింకులు, కాల్స్పై క్లిక్ చేయొద్దు. మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు 1930కి కాల్ చేయాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ ప్రకాష్, స్థానికులు పాల్గొన్నారు.



