తాడేపల్లిలో బీసీ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన

AP: అమరావతిలోని తాడేపల్లి పట్టణంలోని 6వ వార్డులో నారా లోకేష్ సొంత నిధులతో సుమారు రూ.కోటితో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నారు. దీనికి శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు, దానబోయిన సుందర్రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



