ప్రభుత్వ పనుల్లో AI.. ఇక మరింత పెరగనుందా?

ఇక ప్రభుత్వ పనుల్లో AI ఒక ప్రయోగంగా కాకుండా.. రోజువారీ పనుల్లోనూ కనిపించబోతోందా? కేంద్రం డిజిటల్ ఇండియా ప్రాజెక్టుల కోసం మరిన్ని AI, మెషిన్ లెర్నింగ్ భాగస్వాములను చేర్చుకునే ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. ఇప్పటికే ఎంపిక చేసిన సంస్థలతో పాటు టెక్ కంపెనీలను తీసుకురావడం దీని ఉద్దేశం. క్యాబినెట్ నోట్స్ను సారాంశం చేయడం, ముఖ గుర్తింపుతో హాజరు నమోదు, డిజిలాకర్లో AI ఆధారిత సేవలు వంటి పనులకు ఈ టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉందని టెండర్లో పేర్కొన్నారు.



