తిరుమలలో నయనతార దంపతులు..
హీరోయిన్ నయనతార, తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నయనతార ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.



