మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

చర్లకోల శ్వేతారెడ్డి రెండో వర్ధంతిని పురస్కరించుకుని శ్వేత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో జడ్చర్ల పట్టణంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. గౌడ ఫంక్షన్ హాల్లో 8, 9వ తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ప్రకటనలో తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ, క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించాలనే లక్ష్యంతో తన భార్య పకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.



