32 మంది విద్యార్థులు అస్వస్థత

AP: తిరుపతిలోని SV ఆయుర్వేద వైద్య కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. హాస్టల్లో రాత్రి భోజనం చేసిన అనంతరం 32మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 25 మంది యూజీ, ఏడుగురు పీజీ విద్యార్థులు ఉండగా, వాంతులు, వికారం, కడుపునొప్పితో బాధపడిన వారిని స్విమ్స్, TTD సెంట్రల్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కలుషిత ఆహారమే ఘటనకు కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.



