'మగధీర'కి 17 ఏళ్లు..
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ చరణ్,కాజల్ కాంబినేషన్లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ విడుదలైన నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2009 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, తెలుగు సినిమాలో ఒక మైలురాయిగా నిలిచింది.మళ్ళీ జన్మల కాన్సెప్ట్తో తెరకెక్కించిన ఈ విజువల్ మైండ్ బ్లోయింగ్ మూవీ చరణ్ రేంజ్ను పెంచడమే కాదు, రాజమౌళి విజన్ ఏంటో ప్రపంచానికి చూపించింది.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు `#17YearsForMagadheera` ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు.



