అయోధ్యలో కోతుల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు

TG: మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వచ్చిన దైద సాయి అనే ఆరేళ్ల బాలుడు బయట ఆడుకునేందుకు వెళ్తుండగా కోతులు ఒక్కసారిగా దాడి చేసినట్లు తెలిపారు. బాలుడిని కరిచి తీవ్రంగా గాయపరిచినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామంలో కొన్నేళ్లుగా కోతుల దాడులు పెరిగాయని, ఇప్పటికే పలువురు గాయపడినా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కోతులు ఇళ్లలోకి చొరబడి ప్రజలపై దాడులు చేస్తున్నాయని వాపోయారు.





